అసైన్మెంట్ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : పానగల్ మండల అసైన్మెంట్ కన్వీనర్ శ్రీనివాసులు

పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని మండల కన్వీనర్ అన్మగల్ల శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా కమిటీల మేరకు పరిగణలోకి తీసుకొని అందరు సహకారంతో పోరా పోవు భూములను అక్రమాలకు గురికాకుండా చూస్తానని తెలిపారు. దళితులకు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజల తరఫున డిమాండ్ చేశారు.తమపై నమ్మకం ఉంచి మండల కన్వీనర్ బాధ్యతలు ఇచ్చినందుకు సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర,జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
