ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ సిమెంట్ బెంచీ ల బహుకరణ

సూర్యాపేట: ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోని సమాజసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలనిరిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ అన్నారు.జిల్లా కేంద్రంలో బుధవారం వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడు గుంట్ల విద్యా సాగర్ సహకారంతో సతీమణి టీచర్ సరస్వతి జ్ఞాపకార్థం, గుడుగుంట్ల పెద్ద హనుమంతు జ్ఞాపకార్థం, మినీ ట్యాంక్ బండ్ వద్ద మూడు సిమెంట్ బెంచీలు, జూనియర్ కళాశాలలో ఒకటి, కుడ కుడ రోడ్ ప్రాథమిక పాఠశాల స్కూల్ వద్ద ఒకటి, కొత్తగూడెం బజార్ వద్ద ఒక బెంచీలను బహుకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఇసి సభ్యులు తోట శ్యాంప్రసాద్, ఐపీసీ కలకోట్ల లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, మిట్టపల్లి రమేష్, ఆర్సి యామా సంతోష్, జడ్సీ శ్రీకాంత్, పిఎస్టీ నవకోటి వెంకన్న, గుండా సామమూర్తి, తల్లాడ ఉపేందర్, కందిబండ సూరయ్య, మంచాల నాగేశ్వరరావు, ఉప్పల వెంకన్న, ఈగ రామయ్య, కుటుంబ సభ్యులు రంగా పవన్, రంగా దీప్తి, శ్లోక, యువన్, గుడు గుంట్ల శివ నందన్, వాసవి గోవర్ధనీ తదితరులు పాల్గొన్నారు
