
హైదరాబాద్, సెప్టెంబర్ 02, ధర్మఘంట: మియాపూర్ లోని “మేరు ఇంటర్నేషనల్ స్కూల్”లో హిందీ వారోత్సవాల సందర్భంగా హిందీ వార్తా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచి, హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగం పాఠ్యక్రమ కమిటీ అధ్యక్షురాలు డా. సంగీతా వ్యాస్ హాజరై, విద్యార్థులను హిందీని ప్రోత్సహించి వాడుకలోకి తేవాలని ప్రేరేపించారు.
పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల హాజరుతో ఈ కార్యక్రమం మరింత గౌరవప్రదంగా జరిగింది. ఈ సమ్మేళనం విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం మరియు అభివ్యక్తి నైపుణ్యాలను పెంపొందించింది.
