హైదరాబాద్లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 50 లక్షలకే… ఇండిపెండెంట్ ఇల్లు

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు​​​. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండే ధరలు కూడా ఇంకా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం 50 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్, జూలై 27, 2025 (ధర్మఘంట): హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది అని చెప్పవచ్చు. హైదరాబాద్ ప్రముఖంగా ఐటి రంగానికి హబ్ గా మారిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో స్థిరపడుతున్నారు. . మిగతా వీరంతా కూడా నివాసయోగ్యమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నారు ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊతం అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం దేశంలోనే టాప్ రియల్ ఎస్టేట్ ప్రీమియం లొకేషన్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఇక్కడి అపార్ట్మెంట్ ఐదు కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలుకుతున్నాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాగే హైదరాబాద్లోని కోకాపేట, నల్లగండ్ల వంటి ప్రాంతాలు కూడా హై రైజ్ అపార్ట్మెంట్లకు కేరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 65 అంతస్తులు వరకు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ టవర్స్ వంటి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి . దీన్నిబట్టి హైదరాబాద్ నగరం ఏ రేంజ్ లో అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండే ధరలు కూడా ఇంకా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం 50 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

50 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ ఇల్లా అవును మీరు వింటున్నది నిజమే భూముల ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 50 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. కానీ ఇంత తక్కువ ధరకే ఎక్కడ ఇల్లు లభించే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . హైదరాబాద్ నగరంలోని షామీర్ పేట ఏరియా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మౌలిక వసతులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారితో పాటు, రాష్ట్ర రహదారి అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు. అలాగే త్వరలో రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రైలు ఈ ప్రాంతం స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేస్తున్నాయని చెప్పవచ్చు. షామీర్పేట్ చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు ప్రస్తుతం 50 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా విస్తరిస్తున్న కాలనీల్లో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. అలాగే విల్లాస్ కూడా పెద్ద ఎత్తున ఈ ఏరియాలో నిర్మాణం జరుగుతోంది. ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినట్లయితే ఇక్కడ విల్లాస్ ధరలు కేవలం ఒక కోటి రూపాయల లోపే లభిస్తున్నాయి.

 పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు “ధర్మఘంట’ ఎలాంటి బాధ్యత వహించదు. డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలు మరో జూబ్లీ హిల్స్ అవ్వడం పక్కా..

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలు ప్రస్తుతం హాట్ కేకుల్లా ఉన్నాయ్. అక్కడ రియల్ ఎస్టేట్ అంతా బూమ్ ప్రస్తుతం మరో జూబ్లి హిల్స్, మాదాపూర్ కావడం ఖాయం. మరి ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా…

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చుట్టుముట్టిన గ్రామాలు, పట్టణాల్లో భూముల ధరలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరిగినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా తర్వాతి కాలంలో — అంటే 2021 నుంచి 2025 మధ్య — ఈ పెరుగుదల మరింత వేగంగా నమోదైందని నివేదికలు చెబుతున్నాయి. విమానాశ్రయానికి 50 కిలోమీటర్ల పరిధిలో డిమాండ్ కొనసాగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

2000కు ముందు వందల్లో.. ఇప్పుడెంతో పైకి..

విమానాశ్రయం అభివృద్ధికి ముందు, శంషాబాద్ పరిధిలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉండేవి. 1990ల చివరలో చదరపు గజం ధర రూ.500లోపే ఉండేదని అప్పటి రియల్ ఎస్టేట్ డీలర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడీ ప్రాంతం పూర్తిగా మారు రూపం దాల్చింది. శంషాబాద్, బుద్వేల్, సాతంరాయి, మామిడిపల్లి, తుక్కుగూడ వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులు భారీగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ విమానాశ్రయానికి 25-50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి.

ఎలా పెరిగాయి ధరలు..?

రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ స్క్వేర్వార్డ్స్ ప్రకారం, గత ఐదేళ్లలో విమానాశ్రయం సమీప భూగర్భాలు సగటున 74 శాతం ధరల పెరుగుదలను చవిచూశాయి. అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.6,000 నుంచి రూ.8,000 మధ్యగా ఉండగా, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో అదే చదరపు అడుగు ధర రూ.9,000 నుంచి రూ.11,000 వరకు ఉంది. స్థలాల విషయంలో చూస్తే, విమానాశ్రయం సమీపంలో చదరపు గజం ధరలు రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉన్నాయి. అదే సమయంలో ఇతర నగర ప్రాంతాల్లో ఇవే రేట్లు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు వెళుతున్నాయి.

శంషాబాద్ పరిధిలో భవిష్యత్తు!

వాస్తవానికి ఇప్పటివరకు శంషాబాద్‌ చుట్టుపక్కల అభివృద్ధి ఆశించిన స్థాయికి చేరలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవో 111 పరిమితులు, పరిశ్రమలు లేకపోవడం వంటి కారణాలు ప్రధానమైనవని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, గత నాలుగైదేళ్లుగా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి బాగా ఊపందుకుంది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఎకరం స్థలానికి రూ.4 కోట్లు పలుకుతుండగా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం రూ.5,000 నుంచి రూ.10,000 మధ్యలో దొరికే అవకాశముంది. విల్లాల ధరలు రూ.కోటికి పైగానే ఉంటున్నాయి.

అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్

ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాల్లో మౌలిక వసతుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. నాగోల్ నుంచి ఆరంఘర్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణ (లైన్ 2ఏ) ప్రతిపాదించబడింది. రాజేంద్రనగర్‌లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది. శ్రీశైలం-నాగార్జునసాగర్ రహదారుల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది, ఇది విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ యోచనలో ఉంది. మహేశ్వరం పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. ఇటీవల ఓ జ్యువెలరీ తయారీ యూనిట్‌కు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది.

విమానాశ్రయం చుట్టూ రియల్ భూమ్..

పలు బడా నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్, టౌన్షిప్‌లు నిర్మించేందుకు భూముల సేకరణ చేపట్టాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి (RRR) పూర్తయ్యే దశలో ఉండటంతో, శంషాబాద్ పరిధి రాబోయే కాలంలో భారీగా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *