గ్రామీణ క్రీడలను అందరు ప్రోత్సహించాలి

సూర్యాపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో పిలుపునిచ్చిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.

సూర్యాపేట, ఆదివారం, 27.07.2027, (ధర్మఘంట): గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడిపోతున్న గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ముం దుండాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్  వద్ద గల ఓ ఫంక్షన్ హల్ లో  ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్తు కార్యాచరణ సమావేశానికి  ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీలో రాణించి ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ రంగాలలో స్థిరపడ్డారని అదేవిధంగా ప్రస్తుతం కనుమరుగవుతున్న ఈ కబడ్డీ క్రీడను అసోసియేషన్ సభ్యులంతా గ్రామీణ క్రీడాకారులను వెలికితీసి ఉన్నత స్థాయిలో ఉంచాలని  దానికి తాను అన్ని విదాల సహకరిస్తారని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ లో నెలకొన్న సమస్యల గురించి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అందుకు తాను వ్యక్తిగతంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కబడ్డీ క్రీడాకారులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. 

అనంతరం కబడ్డీ క్రీడాకారులు అందరూ కలసి మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడాకారులు రామచందర్ గౌడ్, రామసాని రమేష్ నాయుడు, గాజుల యాదగిరి, వెంకట రమణాచారి, గుడిపాటి సైదులు, లాల్ మజార్, రవీందర్ రెడ్డి, నాగిరెడ్డి, ఇమామ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *