ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్కు చెందిన మహిళ అరెస్ట్
ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్కు చెందిన మహిళ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఫారిన్ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో సయీదా బేగం కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
