ధర్మఘంట ఫిబ్రవరి 02 సూర్యాపేట(ఉమ్మడి నల్లగొండ బ్యూరో శంకర్):సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి కంటిన్యూ అవుతుంది.ఆదివారం 11 వ,వార్డు టిక్కెట్ కోసం, సోమవారం 25 వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వార్డు నాయకులు, కార్యకర్తలు.25వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోడి శివ భార్య కోడి శిరీష కు
ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,వార్డుకు చెందిన మహిళలు పెద్దసంఖ్యలో ఆందోళనకు దిగడం పార్టీ నాయకత్వాన్ని గందరగోళానికి గురి చేస్తుంది.
